కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, థమన్, వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనకు కరోనా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి సురేష్ తన ట్విట్టర్ ద్వారా.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి.. త్వరగా రికవర్ అయి వస్తానని కోరుకుంటుంన్నాను.” అని పోస్ట్ చేసింది.
— Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022
ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా భోళా శంకర్ సినిమాలో అలానే నాని హీరోగా రాబోతున్న దసరా సినిమాలో కూడా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ అలానే మలయాళంలో కూడా సినిమాలు చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: