బాహుబలి, సాహో సినిమాల తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. వీటిలో రాధేశ్యామ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక సెట్స్ పైన మరో సినిమా సలార్ ఉంది . ఈసిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్నీ రోజులు ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో బిజీగా ఉండటంతో సలార్ సినిమా సైడ్ అయిపోయింది. అయితే ఆది పురుష్ సినిమా షూట్ పూర్తి అయిపోయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ప్రభాస్ సలార్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈనేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి పండుగ తరువాతనే మళ్లీ ‘సలార్’ తాజా షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: