సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా చేయి కలపడంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక చిత్రయూనిట్ కూడా ఈ విషయాన్ని సంతోషంగా తమ ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈవీడియోలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మాణ వ్యవహారంలో భాగస్వామి కాబోతోందని స్పష్టం చేసింది. ‘ప్రౌడ్ టు వెల్కమ్ మైత్రీ మూవీ మేకర్స్.. ఆన్ బోర్డు’ అని పేర్కొంది. అంతేకాదు త్వరలోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తామని మేకర్స్ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు.
It’s a pleasure to welcome one of the most sort-after production houses of TFI @MythriOfficial on board for #AaAmmayiGurinchiMeekuCheppali. May the force be with us all🤘#MohanaKrishnaIndraganti @benchmarkstudi5 @IamKrithiShetty @oddphysce @pgvinda #AAGMC pic.twitter.com/qcHF1jOihU
— Sudheer Babu (@isudheerbabu) December 29, 2021
కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బెంచ్మార్క్ స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో ఈసినిమా రూపొందుతుండగా ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: