హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ ” నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ద్వారకా క్రియేషన్స్ అధినేత మిర్యాల రవీందర్ రెడ్డి. తన బర్త్ డే సందర్భంగా విలేకరుల సమావేశం హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. నిర్మాత మిర్యాల మాట్లాడుతూ .. ‘‘అఖండ” సినిమాపై ముందు నుంచీ గట్టి నమ్మకంతో ఉన్నాననీ , బాలకృష్ణ, బోయపాటి కంటే తానే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడాననీ , దానికి కారణం.ఈ సినిమాపై తనకున్న నమ్మకమేననీ , “అఖండ”లో అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్నాయనీ , అఘోరా పాత్ర లో బాలయ్య తన ఉగ్రరూపం చూపించారనీ , .థమన్ సంగీతం మరో ప్లస్ పాయింట్ అయ్యిందనీ , అందుకే ఈ చిత్రం ఇంత పెద్ద విజయ్నాన్ని అందుకుందనీ , హిందీలో ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశం ఉందనీ , “అఖండ”కు సీక్వెల్ చేయాలని కూడా ఉందనీ , 2022 మార్చిలో ఓ కొత్త సినిమా ప్రారంభిస్తున్నాననీ , ఓ కొత్త హీరోని పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాననీ , ఒక స్టార్ హీరోతో కూడా ఓ సినిమా ప్లానింగ్లో ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: