సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” సినిమా తో స్టార్ స్టేటస్ అందుకున్నారు. రష్మిక మందన్న ప్రస్తుతం కన్నడం.. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” బాలీవుడ్ మూవీ 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్”మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక మందన్న తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతూ సౌత్ లో నెం.1 హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక తాజా గా బ్లాక్ శారీ లో ఉన్న తన క్యూట్ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: