బ్లాక్ బస్టర్ “ప్రేమ కావాలి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఆది సాయికుమార్ “లవ్లీ “, సుకుమారుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో అది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల “జంగిల్ “, “కిరాతక” , “బ్లాక్”, “అమరన్ “, “తీస్ మార్ ఖాన్ “, చాగంటి ప్రొడక్షన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ , మిషా నారంగ్ జంటగా క్రైమ్ బ్యాక్ డ్రాప్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆదిసాయికుమార్ నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను “‘సీఎస్ఐ సనాతన్”గా దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. చిత్ర దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ నేరపరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇదనీ , ఇటీవలె తొలి షెడ్యూల్ పూర్తయిందనీ , ఈ నెల 27 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభిస్తున్నామనీ , దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ చెప్పారు. ఈ మూవీ కి అనీష్ సోల్మాన్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: