మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప “మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా చేపట్టింది. ముంబై ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్, రష్మిక సందడి చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ .. “పుష్ప” మూవీ కారణంగా తొలిసారి జాతీయ మీడియా సమావేశంలో పాల్గొంటున్నాననీ , ఇది తన జీవితంలో గర్వించదగిన రోజనీ , బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే తనకు అమితమైన అభిమానమనీ , తాను చెన్నైలో పుట్టి పెరగడం వల్ల దక్షిణాదికి చెందిన సూపర్స్టార్స్ నుంచి ఎక్కువ ప్రేరణ పొందాననీ , మా మావయ్య చిరంజీవి సూపర్ డ్యాన్సర్ అనేది అందరికీ తెలిసిన విషయమేననీ , అయితే తాను మాత్రం కావాలని వాళ్లని ఇమిటేట్ చేయడం లేదనీ , ,కాకపోతే అవి సందర్భానుసారంగా అలా వచ్చేస్తాయేమోననీ , ఇకపై తాను చేసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలయ్యేలా ప్రయత్నిస్తాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: