స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే అభిమానులు ఏ రేంజ్ లో వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోను ఎలాగైనా చూడాలని ఎంత రిస్క్ తీసుకోనైనా సరే వాళ్ల ఈవెంట్స్ కు వెళుతుంటారు. ఇక అలాంటి ఈవెంట్స్ లో తోపులాటలు కూడా ఖచ్చితంగా జరుగుతుంటాయి. కొన్ని కొన్నిసార్లు ఫ్యాన్స్ ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పరిస్థితి కాస్త అదుపుతప్పింది. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైద్రాబాద్ లో పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఫ్యాన్స్ మీట్ పేరుతో అభిమానులకు ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగాలన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ప్లాన్ క్యాన్సిల్ చేశారు. దీంతో అభిమానులు కూడా ఆగ్రహానికి గురయ్యారు. నిర్వాహకులు కూడా వారిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ గొడవలో కొందరు గాయాలపాలైనట్టు కూడా తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా జరిగిన ఘటనపై అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో నా అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. నాటీమ్ ప్రస్తుతం పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారు.. నాకు అప్డేట్ చేస్తున్నారు.. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. మీ ప్రేమ మరియు అభిమానం నా అతిపెద్ద ఆస్తి.. అంటూ బన్నీ ఎమోషనల్ గా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
— Allu Arjun (@alluarjun) December 13, 2021
కాగా బన్నీ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా డిసెంబర్ 17న విడుదలవుతుంది. చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్గా నటించారు. సునీల్, అనసూయ, అజయ్, ధనంజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: