వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం‘. నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్ ‘రవన్న’గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంత వరకూ రిలీజ్ కాలేదు. ఆమధ్య ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై నిర్మాతలు కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈసినిమా కు మిగిలి ఉన్న వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు రానా పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. “మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే” అంటూ ఈ వీడియో మొదలవుతోంది. “చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూరుపు కొండని వెలిగిద్దాం” అంటూ చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో సాగుతుండగా.. అభిమానిగా మారి అతనికోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది.
ప్రజలు బిగించిన పిడికిలి అతడు.
ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని దరించిన అడవి అతడు.
ఆయుధమై కదిలిన ఆకాశం అతడు.
అరణ్య అలియాస్ ‘రవన్న’ 🔥Presenting ‘The Voice Of Ravanna’ from #VirataParvam 🔥
– https://t.co/a7S6f5N8RP#HappyBirthdayRanaDaggubati pic.twitter.com/Teu0wCYkfk
— Suresh Productions (@SureshProdns) December 14, 2021
కాగా ఈసినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా నందితా దాస్, నవదీప్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: