ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఇక ఈసినిమా ఈనెల 17న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, టీజర్, ట్రైలర్ ఏ రేంజ్ లో క్రేజ్ ను పెంచాయో చూస్తున్నాం. ఇక పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ రాగా రీసెంట్ గా రిలీజ్ అయిన సామ్ స్పెషల్ సాంగ్ మాత్రం వీటన్నింటికి మించి ఉండటంతో ఫుల్ వ్యూస్ ను దక్కించుకుంటుంది. మరోసారి స్పెషల్ సాంగ్ లో దేవి తన మార్క్ ను చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈకార్యక్రమంలో చిత్రయూనిట్ అందరూ పాల్గొన్నారు. అయితే అశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఈవెంట్ కు సుకుమార్ రాకపోవడం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా సుకుమార్ ఇంకా దేవి శ్రీ ప్రసాద్ కూడా ముంబాయిలోనే ఉండటంతో వీరిద్దరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయారు. ఇక ఈసందర్బంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కొరటాల శివ బన్నీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంకితభావం, కష్టపడే స్వభావం విషయంలో అల్లు అర్జున్కి ఏ భారతీయ నటుడూ సరిపోడు. ఆయన సినిమా కోసం పెట్టే డెడికేషన్ ను చూస్తుంటే తనకోసం ఎలాంటి కథలు రాయాలో మాకు కూడా అర్థమవుతోంది. పుష్ప తరువాత ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్ కథతో తన దగ్గరకు వెళ్తా అంటూ..సుకుమార్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను అంటూ నిర్మాతలతో పాటు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా గతంలోనే కొరటాల శివ, బన్నీ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఎన్టీఆర్ 30 సినిమా కొరటాలతో ఉంటుందని అనౌన్స్ రావడంతో బన్నీ సినిమాపై కన్ప్యూజన్ వచ్చింది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉందని ఆ సినిమాను నిర్మించే నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























