సుకుమార్-అల్లు అర్జున్కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒకవైపు మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. ఇక అల్లు అర్జున్ కెరీర్ లో వస్తున్న భారీ సినిమా కావడంతో అదే రేంజ్ లో అన్నీ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇందులో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సైతం పట్టుకొచ్చారు. సమంత రాకతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు మరికొద్ది రోజుల్లో ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని అంటున్నారు మేకర్స్. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరి ప్రభాస్ రావడం లేదని తేలిపోయింది ఇప్పుడైనా వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహాద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా, రష్మిక శ్రీ వల్లి గా, సునీల్ మంగళం శ్రీనుగా అనసూయ దాక్షాయణి గా కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: