ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరూ నిర్మాతలుగా మారిపోతున్నారు. డైరెక్టర్స్ దగ్గర నుండి హీరోలు అలానే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ప్రొడక్షన్ లోకి దిగిపోతున్నారు. అంతేకాదు గతంలో ఉన్నట్టు కాకుండా ఒక్క నిర్మాణ సంస్థ నుండే కాకుండా జాయింట్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక మొదటి నుండి భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకూడా వేరే బ్యానర్స్ తో కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ ల నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా ఒక సినిమా వస్తుంది. నిన్ననే ఈసినిమా ప్రారంభించారు. ఇప్పుడు ఈరెండు బ్యానర్స్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈసినిమాను నేడు హైద్రాబాద్ లో లాంచ్ చేశారు. ఈకార్యక్రమానికి రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా విచ్చేశారు.
Absolute Joy to be working in Back to back movies with #MathuVadalara team! This time it’ll be more than double the Mazaaaa in a ‘Surreal Action Comedy’ genre 😀😍 https://t.co/hTUUFjCSnE
— Mythri Movie Makers (@MythriOfficial) November 30, 2021
ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా కాల భైరవ సంగీతం.. సురేష్ సరంగం సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: