ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా నెంబర్ వన్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తన నటనతో.. ప్రయోగాత్మక సినిమాలతో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో అందగాడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు మహేష్. అందుకే టాలీవుడ్ రాకుమారుడు అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా హీరో కంటే ముందే మహేష్ బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిన్నప్పుడే చాలా యాక్టీవ్ గా నటిస్తూ.. ఫైటింగ్స్ సైతం చేసి అందరినీ ఆకట్టుకున్నాడు . 1979లో దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా మహేష్ టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. ఇక బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ నేటితో 42 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాడు. ఇక ఏదైనా విశేషం ఉంటే అభిమానులు సైలెంట్ గా ఉండరు కదా.. ఇప్పుడు ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. 42ఏళ్ల గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో మహేష్ పోస్టర్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: