సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కేవలం నాలుగు షో లే నిర్వహించాల్సి ఉంటుందనీ , చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రాన్పరెన్సీ కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం అనీ , అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బ్రతుకుతెరువు కోసం.. కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లు నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందనీ , .దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం అనీ , దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండనీ , ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందనీ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: