సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ “(2013 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 8 సంవత్సరాలు తరువాత ఒక బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పుష్కర్ ఓజా, సాగర్ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో దిశాపటాని, రాశీఖన్నా కథానాయికలు. రాశీఖన్నా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ప్రయోగాత్మక పంథాలో సాగుతుందని సమాచారం . తన కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ క్యారెక్టర్స్లో ఇది ఒకటని రాశీఖన్నా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: