గమ్యం : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ , శర్వానంద్ , కమలినీ ముఖర్జీ ప్రధానపాత్రలలో తెరకెక్కిన “గమ్యం ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడుగా పరిచయం అయిన క్రిష్ మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. శర్వానంద్ ,అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేదం: ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , మంచు మనోజ్ , అనుష్క ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “వేదం “మూవీ ఘనవిజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనుష్క సరోజ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అల్లు అర్జున్ తన పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
కృష్ణంవందే జగద్గురుమ్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి , నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “కృష్ణంవందే జగద్గురుమ్”మూవీ ఘన విజయం సాధించింది. క్రిష్ తన రెగ్యులర్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి కమర్షియల్ అంశాలు జోడించి “కృష్ణం వందే జగద్గురుమ్ “మూవీ ని చాలా బాగా తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. రానా , నయనతార తమ పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కంచె : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన వార్ ఫిల్మ్ “కంచె ” ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “కంచె “మూవీ లో వరుణ్ తేజ్ తన నటన , హావభావాలతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రగ్య జైస్వాల్ పెర్ఫార్మెన్స్, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన “కంచె” సినిమా తెలుగు ప్రేక్షకులను మరింత గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమాగా నిలిచింది.
గౌతమి పుత్ర శాతకర్ణి : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ , శ్రియ , హేమమాలిని ప్రధానపాత్రలలో చారిత్రక నేపథ్యం లో తెరకెక్కిన “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఘనవిజయం సాధించింది. తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు క్రిష్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలకృష్ణ శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కొండపొలం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన”కొండపొలం ” మూవీ విజయం సాధించింది. హీరో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ లు తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అడవి నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ” కొండపొలం” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు క్రిష్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[totalpoll id=”69473″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























