పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా “లైగర్ ” మూవీ షూటింగుకు అంతరాయం కలుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. వాయిదాలు వేసుకుంటూనే “లైగర్ ” మూవీ చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రీసెంట్ గా గోవా లో ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న “లైగర్ ” మూవీ తాజా షెడ్యూల్ ను మేకర్స్ అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ నెల 12వ తేదీన చిత్ర యూనిట్ అమెరికా వెళుతోంది. ఈ విషయాన్ని వైజాగ్ లో జరిగిన “పుష్పక విమానం”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ కాంబినేషన్లో రూపొందుతున్న “లైగర్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: