టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సమంతకి అరుదైన గౌరవం దక్కింది. 52వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు నవంబర్ 20 నుంచి వారం రోజలు పాటు గోవాలో జరగనున్నాయి. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు నిర్వాహకులు సమంతని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గౌరవ ప్రదమైన హోదా లో సమంత కి ఈ ఆహ్వానం అందింది. సౌత్ నుంచి ఇటివంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ కి హాజరయ్యే నటి సమంత కావడం విశేషం. ఇప్పటివరకూ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఏ సెలబ్రిటీని ఇలాంటి హోదాలా ఆహ్వానించలేదు. తొలిసారి ఆ ఛాన్స్ సమంతకు మాత్రమే దక్కింది. సామాజిక కార్యక్రమాల్లో సమంత చురుకుగా పాల్గొనడం , స్వచ్ఛంద సంస్థలు స్థాపించి ఎన్నో రకాల సేవలు చేయడంతో సమంత కు ఈ ఆహ్వానం అందినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: