యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు.. వీటితో పాటు జంగిల్ సినిమా బ్లాక్ సినిమా రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక తాజాగా ఈసినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. మిషా నారంగ్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. చాగంటి ప్రొడక్షన్ లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: