బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగరాయ్ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ” మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్న సాయి పల్లవి బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా సాయిపల్లవి సరదాగా అభిమానులతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. . ఎలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కామెడీ సినిమా చేయాలనుందని బదులిచ్చారు. సాయి పల్లవి మాట్లాడుతూ .. కామెడీ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగా ఉందనీ, వెండితెరపై అలాంటి పాత్రలో ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారో చూడాలనుందనీ , ప్రాపర్ కామెడీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాననీ , షూటింగ్ లేకపోతే ఇంటికే పరిమితమవుతాననీ , విలాసాల కంటే ప్రకృతి ఒడిలో సేదతీరడమే తనకు ఇష్టమనీ , ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వడం ముఖ్యమనీ , .ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఒత్తిడి నుంచి దూరమవ్వడానికి ప్రయత్నిస్తాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: