ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న మైథలాజికల్ సినిమా ఆది పురుష్. ఇక ఈసినిమాను ఓం రౌత్ మాత్రం చాలా స్పీడుగా పూర్తి చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలను చేయాలంటే కొంతమంది డైరెక్టర్లు ఇంకా చాలా టైమ్ తీసుకుంటారు. కానీ ఓం రౌత్ మాత్రం చాలా ఫాస్ట్ గానే ఆదిపురుష్ సినిమాను ఫినిష్ చేస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఓం రౌత్ పెద్దగా బ్రేక్ లు తీసుకోకుండా షూటింగ్ ను జరిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
గత వారం ప్రభాస్ కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం ప్రారంభించారు మేకర్స్. ఇక తాజాగా “ఆదిపురుష్” షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరొకొన్ని వారాల్లోనే పూర్తి కానుంది.
కాగా భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో 3డీ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: