సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”వరుడు కావలెను “మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“వరుడు కావలెను”మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించింది. “వరుడు కావలెను సంగీత్” ఈవెంట్ కు స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రీతూవర్మ మీడియా తో సమావేశమయ్యారు. రీతూవర్మ మాట్లాడుతూ .. దర్శకురాలు లక్ష్మీ సౌజన్యగారు ఈ కథ చెప్పగానే తనకు బాగా నచ్చేసిందనీ , .అలాగే భూమి పాత్ర కూడా ఎట్రాక్ట్ చేసిందనీ , ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటించాననీ , ఇప్పటి వరకూ తాను చేసిన క్యారెక్టర్స్కి, ఈ చిత్రంలోని పాత్రకి చాలా వేరియేషన్ ఉంటుందనీ , “వరుడు కావలెను “మూవీ ఒక ప్యూర్ లవ్ స్టోరి, మంచి ఎమోషన్స్ ఉంటాయనీ , ఫస్ట్ టైమ్ ఈ మూవీ లో ఒక మాస్ సాంగ్ చేశాననీ , ఆ సాంగ్ని థియేటర్స్లో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనీ , రిలీజ్కి ముందే ఇండస్ట్రీ లో కూడా సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: