విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేక్ రావడం.. దానికి తోడు ఈసినిమా షూటింగ్ చాలా వరకూ ముంబైలోనే షూటింగ్ జరుపుకోవడం.. అక్కడ కరోనా ప్రభావం ఇంకా ఎక్కువ ఉండటంతో మరింత లేట్ అయింది. ఇక ఈమధ్యనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో లైగర్ టీమ్ మరో క్రేజీ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి తెలిపారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ‘లైగర్’ గ్యాంగ్ ముంబైలో ల్యాండ్ అయినట్టు ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #LIGER lands in Mumbai for another crazy schedule💪@TheDeverakonda #Purijagannadh @DharmaMovies @PuriConnects pic.twitter.com/4MEFuQqSPA
— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2021
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈసినిమాలో భాగం అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఇంకా పెరిగాయి.
ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: