నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైనింగ్ నేపథ్యంలో “#NANI 29 “మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. విజయదశమి పండగ సందర్భంగా”#NANI 29 “సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ఈ దసరా నిరుడు లెక్కన ఉండదు’ అనే ట్యాగ్లైన్ తో “దసరా”అనే టైటిల్ , నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సైరన్ ఆఫ్ దసరా అనే వీడియో, మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న “దసరా” మూవీలోని ఆమె లుక్ ను కూడా రివీల్ చేస్తూ.. ‘ఈ దసరా నిరుడు లెక్కన ఉండదు. బాంచత్ జెమ్మివెట్టి చెబుతున్నా.. బద్దల్ బాసింగలయితయ్. ఎట్లైతె గట్లైతది సూసుకుందాం’.. అంటూ నాని పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: