ఓంరౌత్ దర్శకత్వంలో `ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా ఆది పురుష్. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా…కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఓం రౌత్ కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సైఫ్ తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నాడు కూడా. అంతేకాదు ఈ నెలాఖరు వరకు దాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక త్రీడీ సినిమా కాబట్టి ఈసినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ పడుతుంది. ఈనేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాకు సీజీ వర్క్ ఎక్కువగా ఉండటంతో సీజీకి సంబంధించిన పనులను విదేశాల్లోని వివిధ కంపెనీలకు అప్పగించినట్లు సమాచారం. చాలామంది విదేశీ నిపుణులు ఈసినిమా సీజీ వర్క్ కోసం పనిచేయనున్నారట.
కాగా మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఆగస్ట్ 11,2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: