రాజకీయాల కోసం మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ ‘వకీల్సాబ్’ అనే సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్ అయిన భీమ్లా నాయక్ కూడా ఒకటి సాకర్ కే. చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో టాలెంటెడ్ హీరో రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతోపాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్లా నాయక్ టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ లోనే పవన్-రానా మధ్య ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఛేజింగ్ సన్నివేశాలు షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా ఈ సీన్ లో ఉంటారని అంటున్నారు. ఇంటర్వెల్ కి ముందొచ్చే ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.
కాగా ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: