దొరసాని తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ఆనంద్ దేవరకొండ. ఇక రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తాజాగా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ విడుదలచేసిన పోస్టర్లో హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు గుహన్, నిర్మాత వెంకట్ తలారి, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని
తెలిపారు.
కాగా ఈసినిమాలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. నిర్మాత వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: