ప్రభాస్ ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో రాామాయణం ఆధారంగా తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా సమస్యలే తలెత్తాయి. కానీ ఓం రౌత్ మాత్రం ఎక్కడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా పరిస్థితులకు తగ్గట్టు షూట్ ను జరిపాడు. ముంబైలో పరిస్థితులు సహకరించని సమయంలో కూడా హైదరాబాద్ లో షూటింగ్ చేశాడు. ప్రస్తుతానికి అయితే ముంబైలోనే షూటింగ్ జరుగుతుంది. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా. ‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘ఆదిపురుష్’ కోసం వర్క్ చేస్తున్నారు. ఇక తాజాగా సైఫ్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈనేపథ్యంలో అతనికి వీడ్కోలు తెలిపారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనుంది. 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: