పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉండగా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు పవన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా కొండపొలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న క్రిష్ హరి హర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలుపెట్టి కొంతవరకూ పూర్తిచేశాం.. కానీకరోనా వల్ల ఆపాల్సి వచ్చింది.. నవంబర్ సెకండ్ వీక్ నుండి మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తాం.. ఈ షెడ్యూల్ తో ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తవుతుందని తెలిపాడు. అంతేకాదు.. ఈ సినిమా ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుందని ఇలాంటి సినిమా నేనూ చేయలేదు.. ఇప్పటిదాకా తెలుగులో రానే లేదు అని చెప్పి అంచనాలను మరింత పెంచారు. చరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం అని.. వీరమల్లు పాత్రలో పవన్ను చూడగానే తాను చాలా ఎగ్జైట్ అయిపోయానని క్రిష్ తెలిపాడు.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వలైన్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: