సెప్టెంబర్ 10న బైక్ యాక్సిడెంట్ లో గాయాలపాలైన సాయి ధరమ్.. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ మెల్లగా కోలుకుంటున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్ “మూవీ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. హీరో సాయి తేజ్ ఈ మూవీలో కలెక్టర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
See you soon pic.twitter.com/0PvIyovZn3— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021
సోషల్ మీడియా ద్వారా సాయితేజ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ట్విటర్లో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ‘‘మీరు నాపై, “రిపబ్లిక్” సినిమాపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతలనీ , ఈ మాట చాలా చిన్నది అవుతుందనీ , త్వరలోనే అందరి ముందుకు వస్తాననీ సాయి తేజ్ ట్వీట్ చేశారు. సాయి తేజ్ ట్వీట్ కు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసుపత్రిలో ఉన్న సాయితేజ్ ని కలిసి “రిపబ్లిక్” మూవీ లోని ఆయన నటనకి, సినిమా సక్సెస్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి ఫ్లవర్ బొకే అందించారు. సాయిధరమ్ పెర్ఫార్మెన్స్ కు సినీ ప్రముఖుల, రాజకీయనాయకుల , ప్రేక్షకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ “రిపబ్లిక్” టీమ్ కు అభినందనలు తెలిపారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: