అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ముందు ఈసినిమాను ఒక పార్ట్ మాత్రమే అనుకోగా ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే అప్పుడు డేట్ ప్రకటించలేదు చిత్రయూనిట్. ఇక తాజాగా డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్.
This December, Theatres will go Wild with the arrival of #PushpaRaj 🔥#PushpaTheRise will hit the Big Screens on DEC 17th! #PushpaTheRiseOnDec17#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika #FahadhFaasil @Dhananjayaka @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/yB2Ws1HnrA
— Mythri Movie Makers (@MythriOfficial) October 2, 2021
కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…అల్లు అర్జున్ సరనస రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్ గానే రష్మిక ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా యాంకర్ అనసూయ, సునీల్ తదితరలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: