యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ ఆశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసినిమాల్లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మిగిలిన సలార్, ఆదిపురుష్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ సినిమా కూడా గురుపౌర్ణమి రోజున సెట్స్ మీదకి తీసుకెళ్లార. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నాగ్ అశ్విన్ ముందు ఇతర నటీనటులతో ఉన్న పోర్షన్స్ ను పూర్తి చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా త్వరలోనే ఈసినిమా షూట్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.ఇందుకోసం ప్రభాస్ దాదాపు 200 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. నవంబర్ నుండి ఈసినిమా షూటింగ్ లో ప్రభాస్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
కాగా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాకు మహానటి సినిమాకు పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్గా పని చేయనుండగా… అలాగే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాత సి.అశ్వినిదత్ 500కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: