కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగ మార్తాండ‘ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారన్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాను కూడా ఎప్పుడో మొదలుపెట్టాడు కృష్ణవంశీ. అయితే షూటింగ్ జరుగుతుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఈసినిమాకు బ్రేక్ పడింది. ఇక అప్పటినుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈనేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని ఈసినిమా ప్రోగ్రెస్ గురించి అడుగగా.. దానికి కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపి క్లారిటీ ఇచ్చారు. ఇక ఆలోపు మిగిలిన పనులను పూర్తిచేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జట్టు కట్టారు. మరి ఎన్నో ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు కృష్ణవంశీ. ఈ సినిమాతో అయినా మంచి విజయం సాధిస్తారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: