క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్”లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “లైగర్” మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్లో తెరకెక్కిస్తారని సమాచారం .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో 10 వ తేదీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: