వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనుంది. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా #SSMB 28 ” తెరకెక్కనుంది. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న#SSMB 28 ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నవంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందనీ , మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందనీ , ఆ వెంటనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సూపర్ స్టార్ మహేశ్బాబుకు జోడీగా పూజా హెగ్డే నటించనున్న ఈ చిత్రానికి పి డి వి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: