ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్, రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైష్ణవ్ తేజ్, రకుల్ పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గిరిజన యువతి ఓబులమ్మ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ .. గిరిజన అమ్మాయిగా వాస్తవికంగా ఉండటం కోసం చాలా కష్టపడ్డాననీ , తన బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నాననీ , ముఖ్యంగా ఈ సినిమాలో గొర్రెల కాపరిగా ఉండటం కోసం ఎంతో కష్టపడ్డాననీ , గొర్రెలను ఆకర్షించడానికి ప్రత్యేకమైన బ్లీటింగ్ శబ్దాలను నేర్చుకోవడమే కాకుండా, ఆ గొర్రెలను నియంత్రణలోకి తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డాననీ , “కొండపొలం” మూవీ కోసం ఏకంగా సెట్ లో వెయ్యి గొర్రెలతో షూటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: