టాలీవుడ్ హీరోలు ఇప్పుడు సోషల్ మీడియాను బాగానే వాడుతున్న సంగతి తెలిసిందే. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లే కాదు వ్యక్తిగత విషయాలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక అభిమానులు కూడా తమ హీరోలను ఫాలో అవుతుంటారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాను కూడా మిలియన్స్ లో ఫాలో అవుతున్నారు. ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన మహేష్ ఇప్పుడు తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో ట్విట్టర్ నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా మహేష్ టాప్ లో ఉండగా ఇప్పుడు ఫేస్ బుక్ లో 15 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఈ క్లబ్ లో జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన బ్లాస్టర్ ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: