లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో విక్రమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసారి కమల్ గ్యాంగ్ స్టర్ గా సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఆతరువాత కమల్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మరోసారి బ్రేక్ పడింది. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ,షూటింగ్ దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కంటే ముందుగానే కమల్ ఇండియన్ 2 సినిమాను లైన్ లో పెట్టిన సంగతి విదితమే కదా. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. నిజానికి ఈసినిమా మొదలుపెట్టినప్పటినుండి ఏదో ఒక రకంగా షూటింగ్ కు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. దానికితోడు షూటింగ్ స్పాట్ లో క్రేన్ యాక్సిడెంట్ అవ్వడంతో.. పలువురు మృతి చెందడంతో మొత్తానికే ఆగిపోయింది. ఇక ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి. ఫైనల్ గా మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా కమల్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి చిత్ర నిర్మాణ సంస్థకు దర్శకుడికి మధ్య ఉన్న వివాదాలు సర్దుకుంటున్నాయి.. ‘విక్రమ్’ పూర్తయిన వెంటనే ‘ఇండియన్-2’ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చారు. మరి రీస్టార్ట్ అయిన తరువాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: