ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత ఇప్పటివరకూ వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విలన్ గా కూడా పలకరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో కార్తికేయ రాజా విక్రమార్క అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టేసింది. ఇక త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.
కాాగా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: