తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా రూపొందిన “కొండ పొలం” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్, అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటిగా చాలా బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా రూపొందనున్న బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “బెల్ బాటమ్ “మూవీ ఫేమ్ రంజిత్ ఎమ్ తివారి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ , రకుల్ జంటగా సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “గా తెరకెక్కనుంది. ఆ మూవీ “రాక్షసుడు” గా తెలుగు లో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “మిషన్ సిండ్రెల్లా ” మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో లండన్ లో ప్రారంభం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: