ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం కదా. ఏమాత్రం అంచనాలు అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈసినిమా కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ లో కూడా కలెక్షన్ల పరంగా ఈసినిమా తన సత్తా చాటింది. ఇక ఇప్పుడు దీని సీక్వెల్ కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. ఈసినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమాను కూడా కె.జి.యఫ్ లాగే రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందట. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మరి కె.జి.యఫ్ సినిమానే ఓ రేంజ్ లో ఉంటుంది.. అలాంటిది దానికి రెండింతలు అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: