ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ ఆసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేశాడు. ఈసినిమా షూటింగ్ అయితే పూర్త అయింది కూడా. ఇన్ని రోజులు థియేటర్లు లేవు కాబట్టి సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వడంతో త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఎప్పుడో పూజా కార్యక్రమాలు ముగించుకుంది కానీ షూటింగ్ ను మొదలుపెట్టలేదు. అయితే నేడు తాడాగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించామని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
Lights! Camera! & Action 📢💥!#Vaisshnav3 First Day Shoot Commenced Today 🎦🎬.#VaisshnavTej @ketikasharmaa @GIREESAAYA @ThisIsDSP @Shamdat2 @BvsnP @SVCCofficial pic.twitter.com/UOC7BpkgWO
— SVCC (@SVCCofficial) August 10, 2021
కాగా కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్పమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: