అద్భుతమైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫొటో షూట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ డ్రెస్ లలో అందం గా కనిపిస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్న అనసూయ ఇప్పుడు ఒక ఆంథాలజీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “పేపర్ బాయ్”, “విటమిన్-షి” మూవీస్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో 6 కథలతో ఒక ఆంథాలజీ మూవీ తెరకెక్కుతుంది. ఆ మూవీ లోని ఒక కథలో అనసూయ ప్రధాన పాత్ర లో నటించనున్నారనీ , ఎయిర్ హోస్టెస్గా కనిపించబోతున్నారనీ సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: