‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న హీరో రామ్.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈసినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈసినిమాలో భాగంకానున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కన్నడ బ్యూటీ అక్షర గౌడ. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Welcoming Talented Actress @iAksharaGowda Onboard for #RAPO19
Ustaad @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli @anbariv pic.twitter.com/FjfeUX9WtT
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 31, 2021
ఇక ఇప్పుడు ఈసినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా… ఆది పినిశెట్టికి జంటగా అక్షర గౌడ నటించనుందట. తమిళ వెర్షన్ లో మధురై యాసలో తెలుగులో కన్నడ యాసలో మాట్లాడనుందట. ఇదిలా ఉండగా కన్నడ తో పాటు తమిళ్ తో పాటు మన్మథుడు-2 సినిమాలో చిన్న పాత్రలో నటించింది అక్షర గౌడ.
కాగా ఈసినిమాలో నదియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మాత శ్రీనివాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్గా తెరకెక్కించనున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా హైద్రాబాద్ లోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: