మొత్తానికి రాధాకృష్ణ దర్శకత్వంలోప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. నిజానికి సాహో తరువాత స్టార్ట్ అయిన ఈసినిమా దాదాపు సెట్స్ పైకి వచ్చి రెండేళ్లు అవుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కోరనా ఫస్ట్ వేవ్ వల్ల మొదట బ్రేక్ రాగా ఆ తరువాత అందులోనూ ఇటలీ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో చాలాకాలం పాటు షూటింగ్ పెండింగ్ పడింది. ఆతరువాత మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టగా ఇక మరి కొద్దిరోజుల్లో షూటింగ్ అయిపోతుంది అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్ రాగా మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలి ఉన్న షూటింగ్ తో పాటు ప్యాచ్ వర్క్ ను కూడా తాజాగా పూర్తి చేశారు. దీంతో దాదాపుగా రెండేళ్ళ తర్వాత బుధవారం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
All done with the last schedule of #RadheShyam … I spread my love to all our darling fans !! This pandemic had a a toll on all our expectations!! An update is on the way
— Radha Krishna Kumar (@director_radhaa) July 28, 2021
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. మరి జులై 30న ఈ సినిమా విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు మరి ఇదే రిలీజ్ డేట్ ఉంటుందో లేకపోతే డేట్ మార్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: