జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఈసినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంతేకాదు ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను అందిస్తుండగా… చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: