‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్ లవ్ డ్రామా ‘రాధేశ్యామ్’. 1960ల నాటి ఇటలీ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమ కథలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా ఎంత లేట్ అయిందో అందరికీ తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 30న ఈసినిమా రిలీజ్ కావాలి. కానీ కరోనా వల్ల ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా ఈసినిమా గురించి పూజాహెగ్టే మాట్లాడుతూ.. ఇంకా వారం పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉందని.. షూటింగ్ పూర్తయినవెంటనే కాస్త పరిస్థితులు సాధారణ పరిస్థితికి రాగానే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని చెప్పుకొచ్చింది. లవ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.
ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: