వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇటీవల ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన నారప్ప ఓటీటీలో రిలీజ్ చేయడంతో ఈసినిమా కూడా ఆదే బ్యానర్ లో వస్తుండంతో ఈసినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వేణు ఉడుగుల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న వార్తల్లో నిజంలేదని.. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు వేణు. థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. సినిమాలో రానా, సాయి పల్లవిలకు సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్లు చెప్పారు.
కాగా ఇక ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: