గత కొద్దిరోజులుగా వెంకీ నారప్ప రిలీజ్ పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో.. థియేటర్లు కూాడా లేకపోవడంతో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆతరువాత నిర్మాతలు అందరూ సమావేశమవడం.. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయోద్దని.. థియేటర్లు ఓపెన్ అయ్యేంతవరకూ ఆగాలని చెప్పడంతో నారప్ప రిలీజ్ పై అనుమానాలు మొదలయ్యాయి. మళ్లీ థియేటర్ లోనే రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈసినిమా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జూలై 20వ తేదీన స్క్రీనింగ్ కాబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక వెంకీ కూడా తన ట్విట్టర్ వేదికగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.
And, we believe that this love will keep growing until the film will be all yours…Watch it with your near and dear ones at the comfort and safety of your home.#NarappaOnPrime is just a few days and one click away. Releasing on @PrimeVideoIN on July 20.
— Venkatesh Daggubati (@VenkyMama) July 12, 2021
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. నారప్ప పెద్ద కొడుకుగా కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం నటిస్తుండగా… ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
దృశ్యం-2’ కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది అన్నారు. మరి నారప్ప ఓటీటీలో రిలీజ్ చేయడానికే ఫిక్స్ అయ్యారంటే దృశ్యం-2 కూడా ఓటీటీలోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం త్వరలోనే దీనిపై కూడా అధికారిక ప్రకటన ఇస్తారేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: