పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ దుబాయ్లో పూర్తైంది. ఇక కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. దీంతో చాలా రోజుల పాటు దీనికి గ్యాప్ ఇచ్చారు. ఇక, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభం అయింది. కరోనా నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణను ప్రారంభించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి.. ఆ తరువాత పరిస్థితులు ఇంకా కాస్త సాధారణస్థితికి వచ్చిన తరువాత అప్పుడు విదేశాల్లో మిగిలిన పోర్షన్స్ ను కంప్లీట్ చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Superstar is back in AuCTION 😎#SarkaruVaariPaata resumes its shoot 💥#SVPShootResumes 😊
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus pic.twitter.com/lVlJ1fGL15
— Mythri Movie Makers (@MythriOfficial) July 12, 2021
కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: